byసూర్య | Fri, Jan 17, 2020, 06:03 PM
సంక్రాంతి పండుగకు ఊరెళ్లి వచ్చే సరికి వరుసగా మూడు ఇళ్లను గుల్ల చేశారు గుర్తు తెలియని దుండగులు. హైదరాబాద్ సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డి బస్తీలో వరుసగా మూడు ఇళ్లల్లోని 4.5 గ్రాముల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. తమ సొంతూళ్లలో సంక్రాంతి పండుగ సంబరాలు ముగించుకుని నగరంలోని ఇళ్లకు వచ్చేసరికి దొంగతనాలు జరిగాయని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.