byసూర్య | Fri, Jan 17, 2020, 05:47 PM
రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 341 పరుగులు చేయాల్సి ఉంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ బ్యాట్స్ మెన్లు శిఖర్ ధావన్ 96, కేఎల్ రాహుల్ 80, విరాట్ కోహ్లీ 78, రోహిత్ శర్మ 42 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు జంపా మూడు, రిచర్డ్ సన్ రెండు వికెట్లు తీశారు.