నగరం రూపు రేఖలు మారుతున్నాయి : గంగుల కమలాకర్

byసూర్య | Fri, Jan 17, 2020, 03:25 PM

కరీంనగర్ –  కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టి ఆర్ ఎస్ అభ్యర్ధులందరూ నీతివంతమైన పాలన అందిస్తామంటూ బహిరంగా ప్రమాణం చేశారు.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు మంత్రి గంగుల కమలాకర్, హైదరాబాద్ మేయర్, ఎన్నికల పార్టీ పరిశీలకుడు బొంతు రామ్మోహన్ లు బి ఫారమ్స్ అందజేశారు.. ఈ సందర్భం గా అభ్యర్ధులందరితో ఈ విధంగా ప్రమాణం చేయించారు.. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ, “పార్టీ అధినేత కె సి ఆర్, కె టి ఆర్ ఆదేశాల మేరకు బి ఫారామ్స్ ఇచ్చాము. రెండు కార్పొరేటర్లు ఏకగ్రీవం చేయినందుకు ప్రకలకు ధన్యవాదాలు. మా బాస్ కె సి ఆర్, పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుతున్నాం కనుక సక్సెస్ అయ్యాం. అందుకే కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశం జరిపి నీతివంతమైన పాలన అందిస్తామని ప్రమాణం చేయించాం. నగరం రూపు రేఖలు మారుతున్నాయి. మరింత అభివృద్ధి జరగాలంటే టి ఆర్ ఎస్ కు ఓటు వేయాలి. అభ్యర్థులకు పది డివిజన్ లకు ఒక ఇంచార్జి ని నియమించాం. అన్నింటికి నేనే బాద్యతవహిస్తా. మా ఎజెండా లక్ష్యం 700 కోట్ల పనులు పూర్తి చేసి కరీంనగర్ ను హైద్రాబాద్ తరువాత రెండవ నగరంగా తీర్చిదిద్దుతామని చెపుతున్నా. మరో ఐ టి టవర్ వస్రుంది. 6 నేలల్లో 24 గంటల నీటి సరఫరా అందిస్తాం. ఎల్ ఎం డి లొ నీటి కొరత లేకుండా ఉంది కనుక సాధ్యమవుతుంది” అని అన్నారు


Latest News
 

బండి సంజయ్‌ ఆస్తుల లెక్క ఇదే.. కిషన్ రెడ్డి ఇప్పటికీ ఆ కారే వాడుతున్నారు Sat, Apr 20, 2024, 09:31 PM
తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. నేటి నుంచి మూడ్రోజులు వర్షాలు Sat, Apr 20, 2024, 09:26 PM
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులెన్నో తెలుసా..? అదే ఆయన ప్రధాన ఆదాయ వనరు Sat, Apr 20, 2024, 09:19 PM
కుమారుడిపై కేసు భయం.. తల్లి సూసైడ్, ఎంత విషాదం Sat, Apr 20, 2024, 09:10 PM
మామిడి చెట్టెక్కి మరీ,,,,మంత్రి జూపల్లి వెరైటీ ప్రచారం Sat, Apr 20, 2024, 09:06 PM