byసూర్య | Fri, Jan 17, 2020, 03:18 PM
: కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 267 మంది కానిస్టేబుళ్ల శిక్షణ అభ్యర్థులకు 9 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వమే అత్యధికంగా కానిస్టేబుళ్ల ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం పోలీస్శాఖకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.