మద్యం తాగించి దారుణ హత్య..

byసూర్య | Fri, Jan 17, 2020, 01:43 PM

స్నేహితుడిగా నమ్మించి మద్యం తాగించి కసితీరా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతుడి ఇంటికి వెళ్లి భార్యతో తన భర్తను దారుణంగా చంపినట్లు చెప్పి పరారైన ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మెదక్‌ జిల్లా, పాపన్నపేట మండలం, కుర్తివాడకు చెందిన ముక్కుట్ల సౌజన్య, యాదగౌడ్‌(35) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుండిగల్‌ మున్సిపాలిటీ, చర్చిగాగిల్లాపూర్‌లో ఉంటున్నారు. సౌజన్య గృహిణి కాగా.. యాదగౌడ్‌ ఓ ప్రైవేటు ఆటో ఫైనాన్స్‌ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం అదే కాలనీలో ఉంటున్న డీసీఎం డ్రైవర్‌ ఆసీఫ్‌తో యాదగౌడ్‌కు పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఇద్దరు మద్యం తాగుతుండేవారు.


రాత్రి 7 గంటల సమయంలో ఆసిఫ్‌ మద్యం తీసుకొని యాదగౌడ్‌ ఇంటి వచ్చాడు. పక్కనే నిర్మాణంలో ఉన్న డబుల్‌బెడ్‌రూంల ఇండ్ల వద్దకు వెళ్లి తాగారు. అనంతరం ఆసిఫ్‌ కత్తితో యాదగౌడ్‌పై దాడి చేసి ఛాతి, పొట్టలో విచక్షణరహితంగా పొడవడంతో తీవ్రరక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెం దాడు. అనంతరం ఆసిఫ్‌ అదే కత్తితో మృతుడి ఇంటికి వెళ్లి .. నీభర్తను హతమార్చానని చెప్పి అక్కడి నుంచి పరారైయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. అయితే, పక్కా పథకం ప్రకారమే నిందితుడు యాదగౌడ్‌ను హతమార్చినట్లు స్థానికులు భావిస్తున్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM