byసూర్య | Fri, Jan 17, 2020, 12:29 PM
తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ రోజు నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 16 వేల 9 వందల 25 మంది సివిల్ ఆభ్యర్థులు కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు. వీరందరికి తొలివిడతలో శిక్షణ ప్రక్రియ ప్రారంభం కానుంది. హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఆ శిక్షణ కార్యక్రమం జరగనుంది. సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ పరేడ్గ్రౌండ్లో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభిస్తారు. ఇక జోన్ 6 పరిధిలో ఏఆర్, ఆర్ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు అంబర్పేట పోలీస్లైన్స్ పరేడ్గ్రౌండ్లో రిపోర్టు చేయాలని హైదరాబాద్ రేంజ్ ఇంచార్జీ డీఐజీ శివశంకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులు ఐడెంటిటీ కార్డుతో పాటు తొమ్మిది పాస్పోర్టు సైజు ఫొటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని స్పష్టం చేశారు.