byసూర్య | Thu, Jan 16, 2020, 06:19 PM
మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలమైన కేటీఆర్ను... పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత అప్పగించడం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కొత్త కొలువులు, నిరుద్యోగ భృతి గురించి చర్చలేదని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీల్లో డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం విస్మరించిందన్నారు. పురపోరులో బీజేపీని గెలిపిస్తే.. అసలైన అభివృద్ధి ఎంటో చూపిస్తామన్నారు.