కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డికి ఘన నివాళి

byసూర్య | Thu, Jan 16, 2020, 05:41 PM

కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి 78 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డు వద్ద గల ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. రాష్ట్ర కౌన్సిల్ ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పిస్తూ జైపాల్ రెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో జైపాల్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని, జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పారని, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మెట్రో రైలు కు అనుమతులివ్వడం, నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. 


కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి రాజకీయ జీవితం నేటి నాయకులకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసన సభ పక్ష నాయకులు మల్లు భట్టీ విక్రమార్క, మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM
ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్ నిర్మాణ పనులు Tue, Apr 23, 2024, 12:35 PM
యాదాద్రి స్వామి వారి హుండీల లెక్కింపు ప్రారంభం Tue, Apr 23, 2024, 12:35 PM
డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి Tue, Apr 23, 2024, 12:33 PM
ఉపాధి హామీ పథకం టీఏ సస్పెండ్ Tue, Apr 23, 2024, 12:31 PM