byసూర్య | Thu, Jan 16, 2020, 04:15 PM
పురపాలిక ఎన్నికల్లో శంకరపల్లి 2వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బిసోళ్ల సంధ్యరాణి అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డు నుంచి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండగా వారిద్దరు వారి నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కరే మిగలడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. ఆమె శంకర్పల్లి జడ్పీటీసీగా గతంలో 5 సంవత్సరాల పాటు సేవలు అందించారు.