byసూర్య | Thu, Jan 16, 2020, 03:12 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్, విజయనగర్ కాలనీ, ఆసిఫ్ నగర్ తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పూజా కార్యక్రమాల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.