byసూర్య | Thu, Jan 16, 2020, 02:41 PM
పెద్దంబర్ పేట్ మున్సిపాలిటీలో పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతుంది. టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఓ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. 5వ వార్డు నుంచి నామినేషన్ వేసిన బొర్ర అనురాధ సురేష్ కు టీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో ఆమె తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు వెంటనే బీఫారం ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా 5వ వార్డు నుంచి బరిలోకి దించారు.