byసూర్య | Thu, Jan 16, 2020, 01:44 PM
హైదరాబాద్ : హైదరాబాద్ కెపిహెచ్బి కాలనీలో జరిగిన దారుణ ఘటన గురువారం వెలుగు చూసింది. సంక్రాంతి సందర్భంగా.. పార్టీ చేసుకోవాలని కొందరు యువకులు ఒకే చోటకు చేరుకున్నారు. మద్యం తాగి ఎంజారు చేద్దామని వచ్చారు. చివరకు పార్టీలో గొడవపడి కత్తులతో పొడుచుకునేవరకు వెళ్లారు.
గత రాత్రి స్నేహితులంతా పార్టీ చేసుకుంటుండగా వారిలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని పోలీసులు ఈ రోజు మీడియాకు తెలిపారు. మద్యం మత్తులో సుమన్ అనే యువకుడికి అతడి స్నేహితుడు ఒకరు కత్తితో పొడిచాడని చెప్పారు. మిగతా స్నేహితులు సుమన్ను దగ్గరలోకి ఆసుపత్రికి తరలించారని, అయితే, మార్గమధ్యంలోనే అతడు మఅతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై తమకు ఇప్పటివరకు ఎవరి నుంచీ ఫిర్యాదు అందలేదని వివరించారు.