byసూర్య | Thu, Jan 16, 2020, 01:23 PM
హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆసిఫ్ అనే వ్యక్తి యాదగౌడ్ ను ప్లాన్ ప్రకారం డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్దకు తీసుకువచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆసిఫ్ తన వద్ద ఉన్న కత్తితో యాదగౌడ్ ను హత్య చేశాడు. అనంతరం మద్యం మత్తులో ఉన్న ఆసిఫ్ అదే కత్తిని స్థానికులకు చూపుతూ రోడ్డుపై హల్ చల్ చేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.