byసూర్య | Thu, Jan 16, 2020, 11:52 AM
టీఆర్ఎస్ లో మున్సిపల్ టికెట్లపై రచ్చ జరుగుతున్నది. మంత్రి మల్లారెడ్డి, రాపోలు రాములు మధ్య ఫోన్ సంభాషణ లీకైంది. మంత్రి మల్లారెడ్డిపై రాపోలు రాములు తీవ్ర ఆరోపణలు చేశాడు. మంత్రి మల్లారెడ్డిని టికెట్ కోసం నిలదీసింది నేనే అని అన్నారు. ఒక్కో కార్పొరేటర్ టికెట్ కు రూ 50 లక్షలు డిమాండ్ చేశారని అన్నారు. మల్లారెడ్డికి నాయకుడి లక్షణాలు లేవు అని అన్నారు. భూస్వాములకు, రియల్టర్లకే టిక్కెట్లు ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలని రాపోలు రాములు అన్నారు.