byసూర్య | Thu, Jan 16, 2020, 11:20 AM
మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులు తుది జాబితా విడుదల చేశారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తుది జాబితా ఖరారు చేయనున్నారు. మొత్తం 3052 వార్డులకుగాను 12,898 మంది అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. అత్యధికంగా నిజామాబాద్ లో 60 వార్డులకు 415 మంది పోటీ చేయనున్నారు. రామగుండం కార్పొరేషన్ లో 50 వార్డులకు 355 మంది పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ నుంచి బరిలో 2,972 మంది పోటీకి దిగనున్నారు. బీజేపీ నుంచి 2,313 మంది, కాంగ్రెస్ నుంచి 2,616 మంది పోటీకి దిగనున్నారు. సిపిఐ నుంచి 117 మంది, సిపిఎం నుంచి 166 మంది, ఎంఐఎం నుంచి 347 మంది పోటీకి దిగనున్నారు. స్వతంత్రులు 3,750 మంది పోటీలో ఉండనున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించనున్నది.