సానియా సెకండ్ ఇన్నింగ్స్

byసూర్య | Tue, Jan 14, 2020, 03:52 PM

సుదీర్ఘ విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో సానియా మీర్జా తొలి మ్యాచ్ గెలిచేసింది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం మహిళల డబుల్స్‌ ఈవెంట్ ఆడింది. తన భాగస్వామి నడియా కిచెనొక్(ఉక్రెయిన్)తో కలిసి వొకసానా(జార్జియా)-మియూ కటో (జపాన్)ల జోడీని ఓడించారు. 


రెండేళ్ల తర్వాత కోర్టులో అడుగుపెట్టిన సానియా-కిచొనొక్‌తో కలిసి గంట 41నిమిషాల పాటు జరిగిన గేమ్‌లో 2-6 7-6 (3) 10-3 తేడాతో గెలిచింది. తొలి రౌండ్ విజయం తర్వాత ఈ ఇండో ఉక్రెయిన్ జోడీ అమెరికన్ ప్లేయర్లు వానియా కింగ్-క్రిస్టినా మెకలేతో తలపడతారు. రెండేళ్ల విరామం తీసుకున్న సానియా చివరి సారిగా పలు గాయాలతో ఆటకు దూరంగా ఉన్నారు. ఏప్రిల్ 2018లో బాబుకు జన్మనిచ్చిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను పట్టుదలతో మొదలుపెట్టారు. 


ఈ ప్రయత్నంలో ఆమె ప్రత్యేకంగా 20కేజీలకు పైగా బరువు తగ్గారు. ఫీవర్ తో బాధపడుతున్నా డైట్ మిస్ కాకుండా బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. 'నా జీవితంలోని ప్రత్యేకమైన రోజుల్లో ఈ రోజు ఒకటి. నా పేరెంట్స్ నా చిన్ని కొడుకు చాన్నాళ్ల తర్వాత మ్యాచ్ ఆడుతుంటే నాతోపాటే ఉన్నారు. మొదటి రౌండ్ గెలిచాం. ఈ ప్రేమను పొందుతున్నందుకు చాలా గొప్పగా అనిపిస్తుంది. నమ్మకమనేది ఎలాంటి స్థానంలోనైనా కూర్చోబెడుతుంది. అవును నాన్నా మనం సాధించాం' అని కొడుకును ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM