byసూర్య | Tue, Jan 14, 2020, 03:15 PM
వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనం భారత మార్కెట్లోకి వచ్చేసింది. మంగళవారం చేతక్ ద్విచక్రవాహనాన్ని కంపెనీ నిర్వాహకులు విడుదల చేశారు. అర్బన్, ప్రీమియం పేరిట రెండు వేరియంట్లలో ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. చేతక్ ఎలక్ట్రిక్ వాహనం ధర రూ.1లక్ష(ఎక్స్ షోరూం పుణె, బెంగళూరు)గా నిర్ణయించారు. అర్బన్ వేరియంట్ ధర రూ.లక్ష కాగా.. ప్రీమియం వేరియంట్ ధర రూ.1.15లక్షలుగా నిర్ణయించారు. రేపటి నుంచి చేతక్ బుకింగ్స్ను ప్రారంభించనున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల నుంచి వాహనాలను డెలివరీ చేయనున్నారు. ప్రస్తుతం పుణె, బెంగళూరులో మాత్రమే దీన్ని విడుదల చేశారు.