టాస్‌ గెలిచిన ఆసీస్‌

byసూర్య | Tue, Jan 14, 2020, 01:35 PM

ఇండియాతో తలపడనున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆసీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ టాస్‌ గెలిచిన అనంతరం భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వాంఖెడే మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సారథ్యంలో టీమిండియా ఫుల్‌ ఫామ్‌లో ఉంది. ఈ సిరీస్‌కు ముందు ఇండియా.. శ్రీలంకతో జరిగిన టీ 20 సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆస్ట్రేలియా కూడా కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసి, మంచి ఫామ్‌లో ఉంది.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM