byసూర్య | Tue, Jan 14, 2020, 01:35 PM
ఇండియాతో తలపడనున్న తొలి వన్డే మ్యాచ్లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచిన అనంతరం భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. వాంఖెడే మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో టీమిండియా ఫుల్ ఫామ్లో ఉంది. ఈ సిరీస్కు ముందు ఇండియా.. శ్రీలంకతో జరిగిన టీ 20 సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆస్ట్రేలియా కూడా కివీస్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి, మంచి ఫామ్లో ఉంది.