byసూర్య | Tue, Jan 14, 2020, 11:43 AM
బీఫారం దక్క లేదని మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ మున్సిపాలిటీ 14వ వార్డుకి చెందిన విజయ్ బీ ఫారం దక్కలేదని మనస్తాపానికి గురై అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై విజయ్ను అదుపులోకి తీసుకుని.. పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఆయనకు నచ్చజెప్పారు.