byసూర్య | Tue, Jan 14, 2020, 11:05 AM
తెలంగాణ గవర్నర్ తమిళి సై సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెలుగొందాలని ఆమె తెలిపారు. అందరికి సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా గుడులను సందర్శిస్తారు అని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్ తో చర్చించి తమిళనాడు గుడులను సందర్శించే ఏర్పాటు చేస్తా అని అన్నారు. పర్యాటకం పై ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపరిచేలా కృషి చేస్తా అని గవర్నర్ అన్నారు.