byసూర్య | Mon, Jan 13, 2020, 06:09 PM
టీఆర్ఎస్ సోషల్మీడియా టీమ్తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. టీఆర్ఎస్కు పెయిడ్ వర్కర్స్ ఎవరూ లేరన్నారు. టీఆర్ఎస్కు మొదటి నుంచి సోషల్ మీడియా మద్దతుందని ఆయన చెప్పారు. సోషల్ మీడియా ద్వారా మున్సిపల్ ప్రచారం పెంచాలని సూచించారు. కేసీఆర్ కూడా రోజూ సోషల్మీడియా ఫాలో అవుతారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీకి అభ్యర్థులే లేరు.. ఆ పార్టీని చూసి భయపడతామా? అని మంత్రి ప్రశ్నించారు.