byసూర్య | Mon, Jan 13, 2020, 06:09 PM
మున్సిపల్ ఎన్నికలకు ఉమ్మడి జిల్లాల వారీగా కోఆర్డినేటర్లను టీఆర్ఎస్ నియమించింది. 9 జిల్లాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జ్లుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్ గా హైదరాబాద్ మేయర్ బోంతు రామ్మోహన్ ను నియమించారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితిపై ఇన్ఛార్జ్లు ఎప్పటికప్పుడు పార్టీకి నివేదికలు ఇవ్వనున్నారు.టీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది.