byసూర్య | Mon, Jan 13, 2020, 06:06 PM
నేషనల్ గ్రీన్ కార్ప్స్ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 15, 16వ తేదీల్లో 8వ వార్షిక ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు టీఎస్ఎన్జీసి డైరెక్టర్ (ఫుల్ అడిషనల్ఛార్స్) ఎన్.మురళి మోహన్ తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, ఫారెస్ట్అండ్ క్లైమేట్ఛేంజ్, గ్లోబ్ ఏషియా పసిఫిక్ సంయుక్తంగా ఈసమావేశాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. నగరరంలోని బేగంపేటలో ఉన్నతాజ్వివాంటాలో ఈ సమావేశాలు జరుగుతాయని అన్నారు. ఆసియా, పసిఫిక్ రీజియన్కు సంబంధించి దాదాపు40దేశాల నుంచి కోఆర్డినేటర్లు ఈ సమావేశాలకు హాజరవుతారని అన్నారు. అంతర్జాతీయంగా సైన్స్ అండ్ఎడ్యుకేషన్లో ప్రపంచం వ్యాప్తంగా విద్యార్దులకు, సామాన్యల్రపజలకు కల్పిస్తున్న అవకాశాలు వాతావరణం, గ్లోబల్ ఎన్విరాన్మెంట్పై కూడా ఈసమావేశంలో చర్చలు జరుగుతాయని అన్నారు. జాతీయ గ్రీన్ కార్ప్స్ తెలంగాణ రాష్ట్ర విభాగం ఈ సమావేశాన్ని కోఆర్డినేట్చేస్తుందన్నారు.