byసూర్య | Mon, Jan 13, 2020, 03:46 PM
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని ఎఫ్ఏఐ పబ్పై ఆదివారం అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు. యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ దాడి నిర్వజహించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో అశ్లీల నృత్యాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 25 మంది యువతులను అరెస్టు చేశారు. కాగా, పబ్లో పట్టుబడ్డ యువతులు హల్ చల్ చేశారు. దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. సెల్ఫోన్లను నేలకేసికొట్టారు. యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రైవేట్ బస్సులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
రేవ్ పార్టీలో కొంతమంది మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ కరుణ నేతృత్వంలో సిబ్బంది ఎఫ్ఏఐ పబ్ కు చేరుకున్నారు. యువతీ, యువకులను సోదాలు చేసి ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పబ్ లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించారని, విచారించి నిర్వాహకుడు ప్రసాద్ పై కేసు నమోదు చేస్తామని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తెలిపారు.