byసూర్య | Mon, Jan 13, 2020, 01:17 PM
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ పబ్ లో ఆదివారం రాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఓ పబ్ లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాాచారమందింది. పోలీసులు పబ్ పై దాడి నిర్వహించగా 21 మంది యువతులు దొరికారు. ఈ పబ్ ను ఒక రోజు ఈవెంట్ కొరకు ప్రసాద్ అనే వ్యక్తి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. అయితే యువతులతో అశ్లీల చిత్రాలు, నృత్యాలు చేయించేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. యువతులను పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధుల పై ఓ యువతి దాడి చేసి కెమెరాలు, ఫోన్లు కింద పడేసింది. మరికొంత మంది యువతులు తిట్లదండకం మొదలెట్టారు. పబ్ లో అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు దాడి చేసి యువతులను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.