byసూర్య | Mon, Jan 13, 2020, 12:13 PM
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజిల్లేలా దేవతలు దీవించాలని, ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివిరియాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.