byసూర్య | Mon, Jan 13, 2020, 12:01 PM
నిర్మల్ జిల్లా భైంసాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు గల కారణాలోకి వెళ్తే ఓ యువకుడిపై మరోవర్గం దాడి చేయడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. పార్క్ చేసిన వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. 24 బైకులు, కారు, రెండు ఆటోలు దగ్దమయ్యాయి. ఈ సంఘటనతో పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు. అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఐజీలు, నలుగురు ఎస్పీలు, వేయిమంది పోలీసులతో పహారా కాస్తున్నారు. కలెక్టర్ ప్రశాంతి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.