byసూర్య | Mon, Jan 13, 2020, 11:23 AM
భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కానుకలు సమర్పించేందుకు దేవాదాయ శాఖ అధికారులతో పాటు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ ఆలం రామ్మూర్తి, ఈఓ రాజేంద్రం కలిసి అదనపు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 10 హుండీలను, సారలమ్మ గద్దెపై 10 హుండీలను, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు.
భక్తులకు దూర దర్శనం
ఊహించని విధంగా భక్తులు తరలిరావడంతో దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దూర దర్శనం కలిగించారు. గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ను మూసివేసి బయటి నుంచి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.