byసూర్య | Mon, Jan 13, 2020, 08:56 AM
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా బీహార్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు. స్టిల్ ఫ్యాక్టరీ యజమాన్యం బాధితులను పట్టించుకోలేదు.