byసూర్య | Sun, Jan 12, 2020, 08:09 PM
మున్సిపల్ఎన్నికలల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ కసరత్తుచేస్తోంది. ఈమేరకు ప్రచారంలో పార్టీని మరింత ముందుకు తీసుకు పోయేందుకు ఆయా జిల్లాలకు సీనియర్నాయకులను కోఆర్డినేటర్లుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ నియమించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఆయా జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితి పై ఇన్చార్జిలు ఎప్పటికప్పుడు పార్టీకి నివేదికలు ఇవ్వనున్నారు. ఈసందర్భంగా వరంగల్ జిల్లాకు బాలమల్లు, కరీంనగర్కు బొంతురామ్మోహన్, రంగారెడ్డికి ఎమ్మెల్సీ నవీన్, మహబూబ్నగర్కు డీకే శివకుమార్, ఆదిలాబాద్కు దండె విఠల్, ఖమ్మం జిల్లాకు గట్టురామచంద్రరావు, మెదక్ శేరిసుభాష్రెడ్డి, నిజామాబాద్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, నల్గొండ పల్లారాజేశ్వరరెడ్డి నియమితులయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్అభ్యర్ధులు భారీ మెజార్టీతో విజయం సాధించేలా కార్యకర్తలు,నాయకులు కృషి చేసేలా కోఆర్డినేటర్లు పనిచేస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు.