హైదరాబాద్ సిగలో మరో మెట్రో రైలు కారిడార్

byసూర్య | Sun, Jan 12, 2020, 06:53 PM

హైదరాబాద్​లో మరో కారిడార్​లో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. రెండు నెలలుగా ట్రాయల్ నిర్వహిస్తున్న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు రెండో కారిడార్​కు ఇవాళ తుది అనుమతులు లభించాయి. ఈ కారిడార్​లో ఇవాళ 18 రకాల భద్రత తనిఖీలను మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్ నిర్వహించారు. ఆయనతో పాటు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. విద్యుత్, అగ్నిమాపక, భద్రత, లిఫ్ట్స్, ఎస్కలెటర్లు, ట్రాకులను అధికారులు తనిఖీ చేశారు. అనంతరం మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి తుది అనుమతుల పత్రాన్ని మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్ అందించారు. ప్రభుత్వ నిర్ణయం అనంతరం ప్రజలకు ఈ కారిడార్ అందుబాటులోకి రానుంది.


Latest News
 

జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM