byసూర్య | Sun, Jan 12, 2020, 04:51 PM
స్వచ్ఛ సర్వేక్షణ్లో చేపట్టిన కార్యక్రమాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన టాప్ పది నగరాల్లో హైదరాబాద్ కు చోటు లభించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చేసిన కృషిని స్వచ్ఛ భారత్ విభాగం అభినందించింది.సిటిజన్ ఫీడ్ బ్యాక్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మంచి ర్యాంకింగ్ వచ్చేలా గ్రేటర్ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి జీహెచ్ఎంసీఉన్నతాధికారులు సూచించారు.