byసూర్య | Sun, Jan 12, 2020, 03:50 PM
హైదరాబాద్ డబీర్పురా డివిజన్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి రజా అలీ మీర్జా విజయం కోసం కృషి చేస్తామని చార్మినార్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు లాయక్ అలీ అన్నారు. డబీర్ పురా డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన రజా అలీ మీర్జాను పలువురు నాయకులు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా లాయక్ అలీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు.