హత్యకు గురైన యువతి కేసులో కీలక నిజాలు

byసూర్య | Sun, Jan 12, 2020, 03:28 PM

వరంగల్ లో శుక్రవారం హత్యకు గురైన యువతి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలను సీపీ రవీందర్ వివరించారు. ఆయన ఏమన్నారంటే…“హన్మకొండకు చెందిన యువతి, కాజీపేట విష్ణుపురికి చెందిన షాహిద్ హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ కాలేజిలో డిగ్రీ చదివారు. 2016 నుంచి వీరికి పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 6 నెలల క్రితం క్రాంతి హన్మకొండలో ఓ రూంను అద్దెకు తీసుకున్నాడు. ఈ గదికి యువతి కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్లేది. ఇటీవల యువతికి శివనగర్ కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న షాహిద్ కోపంతో రగిలిపోయాడు.


తనకు దక్కనిది ఎవరికి దక్కవద్దని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం సాయంత్రం మాట్లాడుకుందామని రూంకి రమ్మన్నాడు. అక్కడికి యువతి రాగానే షాహిద్ ప్రేమగా ఉన్నట్టుగా నమ్మించాడు. తాను శివనగర్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని, తనని మర్చిపోవాలని యువతి అంది. ఆ సమయంలో కోపం వచ్చినా ఓపికగా వ్యవహరించి మాట్లాడాడు. ఆ సమయంలో యువతితో ఉన్న చనువు ద్వారా లొంగదీసుకొని శారీరకంగా కలిశాడు. తర్వాత యువతిని కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే షాహిద్ హత్యకు పాల్పడ్డాడు.” అని సీపీ రవీందర్ తెలిపారు.


Latest News
 

సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM
దంచికొడుతున్న ఎండలు..ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 07:35 PM