byసూర్య | Sun, Jan 12, 2020, 01:23 PM
సంక్రాంతికి పిల్లలతో కలిసి తల్లిదండ్రులు పతంగులు ఎగరవేస్తారు. పతంగులు ఎగరవేసే సరదాయే వేరు. సంక్రాంతికి ప్రతి యేడాది ప్రభుత్వం హైదరబాద్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ యేడాది కూడ ఈ నెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్ లో ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ కైట్ ఫెస్టివల్లో 25 రాష్ట్రాలకు చెందిన 60 మంది జాతీయ కైట్ ఫ్లేయర్స్ పాల్గోననున్నారు. విచిత్రమైన ఆకారాల్లో ఉండే పతంగులను ఈ వేడుకలో ఎగరవేస్తారు. అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక స్జాళ్లలో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇళ్లలో చేసిన స్వీట్లను అమ్మనున్నారు. తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆటపాటల్ని ప్రదర్శించబోతున్నారు. కైట్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.