సెల్ టవర్ ఎక్కిన యువకుడు

byసూర్య | Sun, Jan 12, 2020, 10:50 AM

ప్రియురాలి కోసం సెల్ టవర్ ఎక్కిన ఓ యువకుడు 8 గంటలపాటు నానా హంగామా చేశాడు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తలకొండపల్లికి చెందిన నీలకంఠం పాండు ఓ అమ్మాయిని ప్రేమించాడు. కొంతకాలంపాటు ఆమెతో సహజీవనం చేసిన పాండు.. ఇటీవల ఆమెను పెళ్లాడాడు. అయితే, కొందరు పెద్దలు తమను విడదీశారని, మళ్లీ తమను ఒక్కటి చేయాలని డిమాండ్ చేస్తూ ఆమనగల్లులోని సెల్‌టవర్ ఎక్కాడు. ఉదయం 5:30 గంటలకు టవర్ ఎక్కిన పాండు.. సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో విషయం వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు టవర్ వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాండు ఎట్టకేలకు కిందికి దిగాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM