byసూర్య | Sat, Jan 11, 2020, 07:22 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆ పార్టీ నేత నందమూరి సుహాసిని అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధ్యాన్యత ఇచ్చింది టీడీపీ అని.. ఆ ఘనత ఎన్టీఆర్ కు చెందుతుందని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందేందుకు నారా చంద్రబాబు తన హయాంలో ఎంతో కృషి చేశారని చెప్పారు. అభివృద్ధిని కాంక్షించే వాళ్లందరూ ముందడుగు వేసి టీడీపీని గెలిపించాలని నందమూరి సుహాసిని విజ్ఞప్తి చేశారు.