byసూర్య | Sat, Jan 11, 2020, 05:56 PM
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. శనివారం ఉదయం తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన పాండు అనే యువకుడు.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి విడిచి వెళ్లిందని బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిని కిందకు దింపారు. అయితే తన దగ్గరకు భార్య రావాలని ఇలా చేశానని వెల్లడించారు. దీంతో పరిసరాల ప్రాంతాల్లో భారీగా జనం గుమిగుడడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.