byసూర్య | Sat, Jan 11, 2020, 02:19 PM
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీనేతలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ స్థానాలు గెలుచుకోవాలని సూచించారు. విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అసంతృప్తులను బుజ్జగించే పనిని జిల్లా నాయకత్వం చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలు టీఆర్ఎస్ విధానాలపై సానుకూలంగా ఉన్నారని.. వారికి కేసీఆర్ ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతోందని... వాటిని ఓట్ల రూపంలో మలుచుకోవాలని దిశానిర్దేశం చేశారు.