పార్టీ నేతలతో సమావేశమైన కేటీఆర్

byసూర్య | Sat, Jan 11, 2020, 02:19 PM

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీనేతలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ స్థానాలు గెలుచుకోవాలని సూచించారు. విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అసంతృప్తులను బుజ్జగించే పనిని జిల్లా నాయకత్వం చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలు టీఆర్ఎస్ విధానాలపై సానుకూలంగా ఉన్నారని.. వారికి కేసీఆర్ ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతోందని... వాటిని ఓట్ల రూపంలో మలుచుకోవాలని దిశానిర్దేశం చేశారు.


Latest News
 

పూజలు నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రఘువీర్ Wed, Apr 24, 2024, 11:42 AM
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి స్పందించిన కేసీఆర్ Wed, Apr 24, 2024, 11:40 AM
చిన్నంగుల గడ్డ తండాలో జడ్చర్ల ఎమ్మెల్యే పూజలు Wed, Apr 24, 2024, 11:39 AM
వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM