byసూర్య | Sat, Jan 11, 2020, 02:16 PM
మున్సిపల్ ఎన్నికల ప్రణాళికలను టీజేఎస్ విడుదల చేసింది. అగ్గిపెట్టె గుర్తుపై టీజేఎస్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ అధినేత కోదండరామ్ తెలిపారు. ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపాలిటీలు నిర్లక్ష్యానికి గురయ్యా, తిరిగి పునరుద్ధరించాలని ఆకాంక్షించారు. ప్రజలను ఓట్లు అడిగే పార్టీలు… ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పాలని కోరారు. కలిసి వచ్చే వారితో కలిసి హైదరాబాద్లో మహాసభ పెడతామన్నారు.