byసూర్య | Sat, Jan 11, 2020, 02:13 PM
కేరళ రాష్ట్రంలోని శబరిమల పుణ్యక్షేత్రంలో కొలువైన హరిహరసుతుడు, అయ్యప్ప స్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరుట్ల శాసన సభ్యులు విద్యాసాగర్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్, వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ ఏలేటి క్రిష్ణా రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అయ్యప్పస్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో కేరళ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.