హైదరాబాద్ ఎల్బీనగర్ లో దారుణం

byసూర్య | Sat, Jan 11, 2020, 01:57 PM

హైదరాబాద్ ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. బాలాజీ నగర్ లో మద్యం మత్తులో ఐదేళ్ల కూతురుని గొంతు నులిమి హత్య చేశాడో తండ్రి. బాలజీ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో దుర్గారావు వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రోజు మద్యం సేవించి భార్యతో గొడవకు దిగేవాడు దుర్గారావు. తాజాగా మద్యం సేవించిన దుర్గారావు మద్యం మత్తులో పెద్ద కూతురు యామిని గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ముద్దులొలికే తమ బిడ్డ ఇక ప్రాణాలతో లేదని తెలియడంతో ఆ చిన్నారి తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.


Latest News
 

ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 03:00 PM
నిత్యవసర సరుకులు పంపిణీ Thu, Apr 18, 2024, 02:57 PM
రూ. లక్ష నగదు పట్టివేత Thu, Apr 18, 2024, 02:55 PM
నేటి నుంచి నామినేషన్ల పర్వం... Thu, Apr 18, 2024, 02:53 PM
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం Thu, Apr 18, 2024, 02:52 PM