byసూర్య | Sat, Jan 11, 2020, 12:53 PM
జీవితాంతం తోడుగా రక్షణ ఉంటానని పెళ్లినాడు చేసిన ప్రమాణాలకు కట్టుబడి.. భార్య ప్రాణాలు కాపాడే క్రమంలో తనువు చాలించాడు ఓ వ్యక్తి. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ట్రైన్ రావడం గమనించి తన భార్యను పక్కకు నెట్టాడు. కానీ, ఇంతలో ట్రైన్ తనపైకి దూసుకురావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. మహబూబ్నగర్ జిల్లా, శంకర గ్రామానికి చెందిన శ్రావణ్కుమార్(42) ఉప్పుగూడలో నివసిస్తూ చెప్పులు కుట్టుకొని జీవిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఫలక్నూమా - ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల మధ్య కందికల్గేటు సమీపంలో భార్య సరితతో కలిసి పట్టాలు దాటుతున్నాడు. ఎంఎంటీఎస్ రైలు వేగంగా రావడాన్ని గమనించి భార్యను పక్కకు తోసేశాడు. అంతలోనే రైలు అతడిని ఢీకొట్టడంతో చనిపోయాడు. రాళ్లపై పడిపోయిన సరితకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు