భార్యను కాపాడే క్రమంలో మరణించిన భర్త

byసూర్య | Sat, Jan 11, 2020, 12:53 PM

జీవితాంతం తోడుగా రక్షణ ఉంటానని పెళ్లినాడు చేసిన ప్రమాణాలకు కట్టుబడి.. భార్య ప్రాణాలు కాపాడే క్రమంలో తనువు చాలించాడు ఓ వ్యక్తి. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ట్రైన్ రావడం గమనించి తన భార్యను పక్కకు నెట్టాడు. కానీ, ఇంతలో ట్రైన్ తనపైకి దూసుకురావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా, శంకర గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌(42) ఉప్పుగూడలో నివసిస్తూ చెప్పులు కుట్టుకొని జీవిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఫలక్‌నూమా - ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల మధ్య కందికల్‌గేటు సమీపంలో భార్య సరితతో కలిసి పట్టాలు దాటుతున్నాడు. ఎంఎంటీఎస్‌ రైలు వేగంగా రావడాన్ని గమనించి భార్యను పక్కకు తోసేశాడు. అంతలోనే రైలు అతడిని ఢీకొట్టడంతో చనిపోయాడు. రాళ్లపై పడిపోయిన సరితకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM