byసూర్య | Sat, Jan 11, 2020, 12:51 PM
పురపాలక ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ డెమొక్రసీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ… ఎన్నికలు నిర్వహించడం అంత సులువు కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదవుతోందన్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ ను అభినందిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.