byసూర్య | Fri, Jan 10, 2020, 08:10 PM
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే జైపూర్ మండలం రసూల్ పల్లి వద్ద ప్రధాన రోడ్డుపై టిప్పర్, టాటా ఏసీ వాహనం ఢీకొని పలువురికి గాయాలయ్యాయి . క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టాటా ఏసీ వాహన దారుడి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది అని క్షతగాత్రులు తెలిపారు.