టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఉపసంహరణ

byసూర్య | Mon, Oct 14, 2019, 08:06 PM

హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు ప్రకటించిన మద్దతును సీపీఐ ఉపసంహరించుకుంది. ఈ మేరకు తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూర్ నగర్ లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది రేపు ప్రకటిస్తామని, ఆర్టీసీ ఉద్యమంలో అగ్రభాగాన ఉండాలని నిర్ణయించామని అన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలవాలని, వారి సమస్యలు పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM