byసూర్య | Mon, Oct 14, 2019, 08:06 PM
హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు ప్రకటించిన మద్దతును సీపీఐ ఉపసంహరించుకుంది. ఈ మేరకు తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూర్ నగర్ లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది రేపు ప్రకటిస్తామని, ఆర్టీసీ ఉద్యమంలో అగ్రభాగాన ఉండాలని నిర్ణయించామని అన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలవాలని, వారి సమస్యలు పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.