byసూర్య | Mon, Oct 14, 2019, 06:06 PM
మహబూబాబాద్: ప్రమాదావశాత్తూ ఓ గీత కార్మికుడు మరణించాడు. స్థానికుల వివరాల ప్రకారం.. దంతాలపల్లి మండలం, కుమ్మరిగంట్ల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు కారుపోతుల ఉప్పలయ్య తన వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా.. దాదాపు చెట్టు పై వరకు వెళ్లిన అతడు అదుపు తప్పి జారిపడ్డాడు. ఈ ఘటనలో ఉప్పలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విన్నవించారు.