byసూర్య | Mon, Oct 14, 2019, 06:04 PM
తెలంగాణలో మరో ఆర్టీసి కండక్టర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. సోమవారం మధ్యాహ్నం హెచ్ సీయూ డిపో ఎదుట సందీప్ అనే కండక్టర్ బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. దీంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అతనిని కొండాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. గత నెల జీతాలు ఇంకా అందకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. కార్మికులు ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.