byసూర్య | Mon, Oct 14, 2019, 05:20 PM
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రెండున్నరేళ్ల బాలిక అపహరణ కలకలం రేపింది. సురేష్ అనే వ్యక్తి అర్ధరాత్రి వేళ నెల్లూరు వెళ్లేందుకు కుమారుడు, కుమార్తెతో రైల్వేస్టేషన్ కు వచ్చి రైలు ఇంకా సమయం ఉండడంతో ఫ్లాట్ ఫామ్ పై పడుకుని నిద్రలోకి జారుకున్నారు. నిద్రిస్తున్న బాలికను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. సిసి కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.