దుర్గామాత దర్శనానికి వచ్చి వ్యక్తి మృతి

byసూర్య | Mon, Oct 14, 2019, 02:10 PM

మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల్లో దుర్గామాత దర్శనానికి వచ్చిన ఒక వ్యక్తి నీటమునిగి మృతి చెందినట్లు పాపన్నపేట ఎస్ ఐ ఆంజనేయులు వెల్లడించారు. ఆయన సమాచారం మేరకు హైదరాబాదులోని ముషీరాబాద్ లోని బాకారం ప్రాంతానికి చెందిన సంగిశెట్టి మురళి 45 అమ్మవారి దర్శనం కోసం గురువారం సాయంత్రం ఏడుపాయల కు చేరుకొని మంజీరా నదిలో స్నానానికి వెళ్ళగా నీటమునిగాడు. ఈత రాకపోవడంతో బయటకు రాలేక మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. కాగా ఇతనికి భార్య సంగిశెట్టి లలిత, ఒక కుమారుడు కూతురు ఉన్నారు. మురళి జాడ తెలియకపోవడంతో శుక్రవారం ఉదయం మృతుడు భార్య సంగిశెట్టి లలిత పాపన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.... నదిలో వెతకగా మృతదేహం లభ్యం అయినట్లు ఎస్ఐ వివరించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM